సిద్దిపేట, వెలుగు: జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో కన్సొలేషన్ ప్రైజ్ కు ఎంపికైన సిద్దిపేట జిల్లా వీ6 వెలుగు ఫొటో జర్నలిస్ట్ మహిమల భాస్కర్ రెడ్డికి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుమతి అందజేశారు. శనివారం హైదరాబాద్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆల్ ఇండియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రైజ్ ను అందజేసి అభినందించారు. భాస్కర్ రెడ్డిని సిద్దిపేట జిల్లా జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, ప్రముఖులు అభినందించారు.
