
న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు neet.nta.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని NTA సూచించింది. మే 4న నీట్ ఎగ్జామ్ జరిగింది. తెలంగాణలో మొత్తం 190 సెంటర్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహించారు.
National Testing Agency (NTA) announces results of NEET (UG) 2025 pic.twitter.com/agseL8AnYi
— ANI (@ANI) June 14, 2025
రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 62 కేంద్రాల్లో 26 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం గమనార్హం. నీట్ యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది అభ్యర్థులు హాజరవగా, 12 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
నీట్ యూజీ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు:
1. మహేష్ కుమార్– ర్యాంక్ 1
2. ఉత్కర్ష్ అవాధియా– ర్యాంక్ 2
3. క్రిషంగ్ జోషి– ర్యాంక్ 3
4. మృణాల్ కిషోర్ ఝా– ర్యాంక్ 4
5. అవికా అగర్వాల్– ర్యాంక్ 5
6. జెనిల్ వినోద్ భాయి భయాని– ర్యాంక్ 6
7. కేశవ్ మిట్టల్– ర్యాంక్ 7
8. ఝా భవ్య చిరాగ్– ర్యాంక్ 8
9. హర్ష్ కేదావత్– ర్యాంక్ 9
10. ఆరవ్ అగర్వాల్– ర్యాంక్ 10