
- ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
హైదరాబాద్, వెలుగు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరుశురామ్ వెల్లడించారు. ఈ డిమాండ్పై దేశవ్యాప్తంగా పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ఈ నెల 23న ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి 26 వరకు చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉద్యమ పోస్టర్ను బషీర్బాగ్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆవిష్కరించారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కోరుతూ ప్రధాని మోదీకి లక్ష మందితో పోస్ట్ కార్డ్లు రాస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు, అంబేద్కర్ వాదులుపాల్గొనాలని కోరారు.