
- రష్యాతో వ్యాపారం చేస్తే 100% టారిఫ్ వేస్తం
- ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్
- ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే
- తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
వాషింగ్టన్: రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే వదిలిపెట్టబోమని, 100 శాతం టారిఫ్లు వేస్తామంటూ ఇండియా, చైనా, బ్రెజిల్ను నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపాల్సిందేనని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించాల్సిన బాధ్యత ఈ మూడు దేశాల అధినేతలపై ఉందని పేర్కొంది. వెంటనే ఆయనకు ఫోన్ చేసి చర్చలకు అంగీకరించేలా ఒత్తిడి తేవాలని తెలిపింది.
వార్ ఆపకపోతే రష్యాపై 100 శాతం టారిఫ్ విధిస్తామని, ఇందుకు 50 రోజుల గడువు పెడ్తున్నట్లు మూడు రోజుల కింద అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం టారిఫ్ విధిస్తామంటూ కొన్నాళ్లుగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం అమెరికా సెనెటర్స్తో వాషింగ్టన్లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె సమావేశయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా, చైనా, బ్రెజిల్కు హెచ్చరికలు చేశారు. ‘‘ఇండియా ప్రధానమంత్రి అయినా సరే, చైనా అధ్యక్షుడైనా సరే, లేదా బ్రెజిల్అధ్యక్షుడైనా సరే రష్యాతో బిజినెస్ కొనసాగిస్తే.. అక్కడి నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే భారీ పెనాల్టీలు తప్పవు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఆ మూడు దేశాల అధినేతలపై ఉంది.
పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని ఒత్తిడి తెండి. ఆయన శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది” అని మార్క్ రుట్టె హెచ్చరించారు.