గ్లోబల్ స్టార్తో నేచురల్ బ్యూటీ.. ఇది కదా కాంబో అంటే!

గ్లోబల్ స్టార్తో నేచురల్ బ్యూటీ.. ఇది కదా కాంబో అంటే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామా సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా నుండి తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రానుంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.

ఇక ఈ న్యూస్ తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కదా కాంబో అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సాయి పల్లవి అంత ఈజీగా ఒక సినిమాకు ఓకే చెప్పరు. ఆమె ఒక సినిమాను ఓకె చేశారంటే ఆ సినిమాలో మినిమమ్ కంటెంట్ ఉంటుందని అర్థం. అంతేకాదు.. సాయి పల్లవి సూపర్ నేచురల్ యాక్టర్. మరోపక్క రామ్ చరణ్ కూడా రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేశారు. కాబట్టి.. ఈ ఇద్దరు సూపర్ నేచురల్ యాక్టర్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సంచనాలు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి. మరి నిజంగా రామ్ చరణ్ సినిమాలో సాయి పల్లవి ఒకే అయ్యారా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.