- వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి
హైదరాబాద్, వెలుగు: ‘నవ స్కిన్ అండ్ బాడీ క్లినిక్’ ప్రారంభమై నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం బంజారాహిల్స్లోని క్లినిక్ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాక ఇండస్ట్రీస్ చైర్మన్ డా. వివేక్ వెంకటస్వామి రీ లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ నవీన్, డాక్టర్ వ్రితికా నాలుగేండ్ల కిందట నవ క్లినిక్ను ప్రారంభించి ఎంతోమందికి బెటర్ ట్రీట్మెంట్ను అందించారన్నారు. భవిష్యత్లోనూ వారు ఇదే విధంగా పని చేస్తూ వ్యాపారపరంగా ఎదగాలన్నారు. నవ డెర్మటాలజీ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ నవీన్ మాట్లాడుతూ.. స్కిన్, హెయిర్, నెయిల్స్కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా తమ క్లినిక్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నారు.
వార్షిక వేడుకలను రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ వ్రితికా గడ్డం మాట్లాడుతూ.. మొదట హైటెక్ సిటీలో చిన్న స్థలంలో తమ క్లినిక్ను మొదలుపెట్టామన్నారు. బంజారాహిల్స్ కి మార్చిన తర్వాత క్లయింట్ల నుంచి రెస్పాన్స్ పెరిగిందన్నారు. క్లినిక్కు వచ్చే ప్రతి క్లయింట్కు బెటర్ ట్రీట్మెంట్తో పాటు పోస్ట్ కేర్ను కూడా దగ్గరుండి చూసుకుంటామన్నారు. టోనింగ్ కోసం ఇన్షేప్ అనే ప్రత్యేక మెషీన్ను క్లినిక్లో అందుబాటులో ఉంచామన్నారు.