- నక్సలైట్ హతం
రాయ్పూర్: చత్తీస్గఢ్లోని రాయ్పురాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో నక్సలైట్ చనిపోయాడు. దంతేవాడ జిల్లాలోని హుర్రేపాల్, బిచాపల్ కొండ ఫారెస్ట్ రేంజ్ మధ్య టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారని, ఆ సమయంలో ఎదురుకాల్పులు జరిగాయని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ పల్లవా చెప్పారు. చనిపోయిన వ్యక్తిని మావోయిస్టు మిలటరీ ప్లటూన్ నెం.2 మెంబర్ దస్రూ పునెంగా గుర్తించామని అన్నారు. అతనిపై రూ.8లక్షల రివార్డు ఉందని అన్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.