బైజూస్‌కు ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

బైజూస్‌కు ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ కంపెనీ టెలీపెర్ఫార్మెన్స్‌ బిజినెస్ సర్వీసెస్‌ పిటీషన్ వేయడంతో బైజూస్‌కు  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌టీ) నోటీసులు ఇష్యూ చేసింది. ఈ ఎడ్‌టెక్ కంపెనీ  రూ. 4 కోట్ల  అప్పు పడిందని, తీర్చడం లేదని ఈ పిటీషన్‌లో టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ పేర్కొంది. నోటీసులపై  రెండు వారాల్లో బైజూస్ స్పందించాల్సి ఉంటుంది. మార్చి 11 కు హియరింగ్ ఉంటుంది.

కాగా, టెలీపెర్ఫార్మెన్స్, కోజెంట్‌ ఈ సర్వీసెస్‌, ఐఎనర్జైజర్‌‌ వంటి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలతో  2022 మధ్య వరకు బైజూస్ బిజినెస్‌ చేసింది. ఈ కంపెనీలు కాలింగ్ ఏజెంట్లను బైజూస్‌కు సప్లయ్‌ చేశాయి. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా టెలీపెర్ఫార్మెన్స్‌, కోజెంట్ ఈ సర్వీస్‌లతో వ్యాపారాన్ని బైజాస్ 
ఆపేసింది.