యాదాద్రి జిల్లాలోని కార్పొరేట్ స్కూల్ లో చిన్నారులపై వేధింపులు

యాదాద్రి జిల్లాలోని కార్పొరేట్ స్కూల్ లో చిన్నారులపై వేధింపులు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని ఓ కార్పోరేట్​ స్కూల్​లో చిన్నారులపై వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేషనల్​ కమిషన్​ ఫర్​ ప్రొటెక్షన్​ ఆఫ్​ చైల్డ్​రైట్స్ (ఎన్​సీపీసీఆర్​) నుంచి ఆదేశాలు రావడంతో ఎడ్యూకేషన్​ డిపార్ట్​మెంట్​ కదిలి స్కూల్​ను సందర్శించి, విచారణ జరిపింది. ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని బీబీనగర్​లోని ఓ కార్పొరేట్​ స్కూల్(బిర్లా ఓపెన్​ మైండ్​)​లో దాదాపు 1200 మంది చదువుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్​ వస్తుండడంతో హాస్టల్​ కూడా మెయింటేన్స్​ చేస్తున్నారు.

ఈ స్కూల్​లో పలువురు చిన్నారులపై అక్కడి స్టాఫ్​ ఇటీవల వేధింపులకు పాల్పడ్డారు.  వేధింపుల విషయం నేషనల్​ కమిషన్​ ఫర్​ ప్రొటెక్షన్​ ఆఫ్​ చైల్డ్​రైట్స్ (ఎన్​సీపీసీఆర్​) దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా ఎడ్యూకేషన్​ డిపార్ట్మెంట్​కు ఎన్​సీపీసీఆర్ విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసింది.  స్టూడెంట్స్​ పట్ల కొందరు స్టాఫ్​ అనుచితంగా ప్రవర్తించినట్టు ఎన్​సీపీసీఆర్ తమ దృష్టికి తెచ్చిందని యాదాద్రి డీఈవో సత్యనారాయణ అన్నారు. స్టూడెంట్స్​తో మాట్లాడాం.  హాస్టల్​కు అనుమతి లేదని తెలిసింది. స్కూల్​పై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. 1200 మంది స్టూడెంట్స్​ చదువు ఇబ్బందులో పడే ప్రమాదం ఉంది. ముందుగా హాస్టల్​ తొలగించాలని నోటీసులు ఇస్తాం.