గురుగ్రామ్: ప్రముఖ ఆన్లైన్ పుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరో వివాదంలో ఇరుక్కుంది. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ జొమాటోకి నోటీసులు పంపింది. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ విడుదల చేసిన ఓ యాడ్ దళితులను కించపరిచేలా ఉందనే విమర్శలు వచ్చాయి.
దీంతో ఆ యాడ్ ను సంస్థ తొలగించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ మాత్రం దీనిని సీరియస్గా తీసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు చేపడుతూ.. సీఈవో దీపిందర్ గోయెల్ గడువులోగా దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది. లేదంటూ వ్యక్తిగతంగా హాజరయ్యేలా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.