జొమాటోకి నోటీసులు.. సంస్థను వదలని యాడ్ వివాదం

జొమాటోకి నోటీసులు..  సంస్థను వదలని యాడ్ వివాదం

గురుగ్రామ్​: ప్రముఖ ఆన్​లైన్​ పుడ్​ డెలివరీ సంస్థ జొమాటో మరో వివాదంలో ఇరుక్కుంది. జాతీయ షెడ్యూల్​ కులాల కమిషన్​ జొమాటోకి నోటీసులు పంపింది. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ విడుదల చేసిన ఓ యాడ్​ దళితులను కించపరిచేలా ఉందనే విమర్శలు వచ్చాయి. 

దీంతో ఆ యాడ్​ ను సంస్థ తొలగించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. ​జాతీయ షెడ్యూల్​ కులాల కమిషన్ మాత్రం దీనిని సీరియస్​గా తీసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు చేపడుతూ.. సీఈవో దీపిందర్​ గోయెల్​ గడువులోగా దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది. లేదంటూ వ్యక్తిగతంగా హాజరయ్యేలా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.