
- ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశం=
- మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ లేఖ
న్యూఢిల్లీ : కీర్తిచక్ర, అమర సైనికుడు కెప్టెన్అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి ఫోటో కింద సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్అరోరాకు ఓ లేఖ రాసింది.
సోషల్ మీడియాలో స్మృతి ఫొటో కింద ఢిల్లీకి చెందిన అహ్మద్ కే అనే వ్యక్తి అసభ్యకరంగా కామెంట్ పెట్టినట్టు తాము గుర్తించామని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది. ఈ కామెంట్ భారత న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 79, ఐటీ యాక్ట్లోని సెక్షన్ 79 కింద ఉల్లంఘన కింద వస్తుందని వెల్లడించింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలన ఆదేశించింది.