ఇయ్యాల ఢిల్లీలో అఖిలపక్ష భేటీ

ఇయ్యాల ఢిల్లీలో అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 (గురువారం) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆల్​ పార్టీ మీటింగ్​కు కేంద్రం పిలుపునిచ్చింది. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పలువురు ఈ భేటీకి హాజరవుతారు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు లేవనెత్తిన సమస్యలపై చర్చించను న్నారు.  మరోవైపు రాజ్యసభ చైర్మన్​జగ్దీప్​ ధన్​కర్​ మంగళవారం పిలుపునిచ్చిన ఆల్​ పార్టీ మీటింగ్​ వాయిదా పడింది. ఓవైపు బెంగళూరు లో ప్రతిపక్షాల భేటీ, మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నేపథ్యంలో ఆల్​ పార్టీ మీటింగ్​కు అతితక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని చైర్మన్ జగ్దీప్ ధన్​కర్ వాయిదా వేశారు.