పెరిగిన పెద్దవాగు ఉధృతి.. రాకపోకలు బంద్

పెరిగిన పెద్దవాగు ఉధృతి.. రాకపోకలు బంద్

కాగజ్ నగర్/కడెం వెలుగు: కాగజ్ నగర్ మండలం అందెవెల్లి దగ్గర పెద్దవాగు బ్రిడ్జి కూలిపోయిన చోట రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. సోమవారం వరకు వాగులో ప్రవాహం తక్కువ ఉండడంతో ప్రజలు నీటిలో నడుస్తూ వెళ్లారు. అయితే, సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరిగింది. 

వరద ప్రవాహానికి రహదారిపై తాత్కాలికంగా వేసిన పైప్​కు రంధ్రం పడింది. దీంతో దహేగం–కాగజ్ నగర్ మండలాల మధ్య కనెక్టివిటీ తెగిపోయి, ప్రజలు ఇతర మార్గాల్లో వెళ్తున్నారు. చింతల మానేపల్లి మండలం దిందా వాగుకు సైతం వరద ప్రవాహం పెరిగి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.