రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి నెక్లెస్ రోడ్లో ఆదివారం ‘సంవిధాన్ శక్తి’ పేరిట 3కే, 5కే రన్ నిర్వహించారు. ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ప్రారంభించారు. సిటీ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
