
- ప్రేమకథా..చిత్రం
బాలు, స్నేహ జంటగా ఇంట్రడ్యూస్ అవుతున్న ప్రేమ కథా చిత్రం ‘నీ వెంటే నేను’. అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మిస్తున్నారు. సినీ బజార్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్లో అక్టోబర్ 6న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఇదొక క్లీన్ లవ్ స్టోరీ అని చెప్పారు బాలు, స్నేహ. సినీ బజార్ సీఈవో రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. పైరసీకి ఎట్టి పరిస్థితుల్లో తావులేని విధంగా సినీ బజార్ను తీర్చిదిద్ధాం’ అన్నారు.