ఏపీ తొలి మహిళా సీఎస్ గా నీలం సాహ్ని..

ఏపీ తొలి మహిళా సీఎస్ గా నీలం సాహ్ని..

ఏపీ తొలిమహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిఇవాళ (గురువారం) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర సామాజిక న్యాయ, ఎంపవర్ మెంట్ కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఆంధ్రప్రదేశ్ కు తొలిమహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

1984వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం ,టెక్కలిలో అసిస్టెంట్ కలెక్టర్ గా..నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా,కలెక్టర్ గా పనిచేశారు. మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా,హైదరాబాద్ లో స్త్రీ,శిశు సంక్షేమశాఖ పీడీగా విధులు నిర్వర్తించారు. నిజామా బాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పలు హోదాల్లో పనిచేశారు. ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్, టీఆర్ ఆండ్బీ కార్యదర్శి, క్రీడల శాఖ కమిషనర్,సాప్ వీసీ, ఎండీ వంటి హోదాల్లో  ఆమె పని చేశారు.