నీట్​ పరీక్షను రద్దు చేయాలి

నీట్​ పరీక్షను రద్దు చేయాలి

పంజాగుట్ట, వెలుగు: నీట్​పరీక్షను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్​వీ నేతలు రాజ్​భవన్ ను ముట్టడించారు. బీఆర్ఎస్​వీ  రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ యాదవ్ సహా పలువురు నేతలు రాజ్ భవన్​ ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్​ చేసి ఎస్సార్​నగర్ ​పోలీసుస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​ యాదవ్​ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సీఎం రేవంత్​ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్ ​ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని నీట్​సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.