డ్యూటీలో నిర్లక్ష్యం..ఇద్దరు ఎస్ఐలపై వేటు

 డ్యూటీలో నిర్లక్ష్యం..ఇద్దరు ఎస్ఐలపై వేటు

నల్గొండ: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఎస్ఐలపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ప్రస్తుత కరోనా సమయంలో క్షేత్ర స్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమై ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సిన ఇద్దరు సబ్ ఇన్స్ పెక్టర్లు నిర్లక్ష్యం వహించినందుకు మూల్యం చెల్లించుకున్నారు. చండూరు, మర్రిగూడ ఎస్ఐలు ఉపేందర్ రెడ్డి, క్రా౦తి కుమార్ లను వెంటనే వీఆర్ కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సమయంలో ఎంతో జాగ్రత్తగా విధులు నిర్వహించినప్పటికీ చిన్న కారణం చూపి ఇంత తీవ్రంగా.. వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడాన్ని బదిలీ అయిన ఎస్ఐలు జీర్ణించుకోలేకపోయారు. వీరి బదిలీ వ్యవహారం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. సాధారణమేనని సీనియర్లు అంటుంటే.. మరీ ఇంతగానా అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.