
తెలంగాణ ఎన్నికల దృష్ట్యా నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నవంబర్ 30న మూసివేయనున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్ లో పిల్లలకు సెలవస్తే చాలు.. ట్యాంక్ బండో.. గోల్కొండ ఖిల్లాకు కాని.. జూపార్క్ కు కాని తీసుకెళ్లాలని పేరెంట్స్ ను సతాయిస్తుంటారు. ఒక్కోసారి స్కూలు యాజమాన్యాలే ప్లాన్ చేస్తుంటాయి. అయితే తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఇక ఆరోజు జూ ఆపార్క్కు వెళ్లి ఎంజాయి చేద్దామనుకొనే పిల్లలకు నిరాశ ఎదురైంది. నవంబర్ 30 జూపార్క్ కు అధికారులు సెలవు ప్రకటించారు.
నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు కాన ఆ రోజు తెలంగాణ ఉద్యోగులకు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సెలవు ఇవ్వని ప్రైవేట్ కంపెనీలపై , ఐటీ కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేబర్ కమిషనర్ను తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు.