పక్కింటి వారి వేధింపులు.. తల్లీకొడుకుల సూసైడ్​

పక్కింటి వారి వేధింపులు.. తల్లీకొడుకుల సూసైడ్​

న్యూఢిల్లీ: కరోనాతో భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది ఆమె.. దీనికి తోడు కొడుకుపై పక్కింటి వారి కంప్లయింట్స్​మరింత బాధ పెట్టాయి. ‘మీ అబ్బాయి  అల్లరి ఎక్కువైంది.. అది చేస్తున్నాడు.. ఇది చేస్తున్నాడు’ అంటూ పదే పదే గొడవ చేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై పిల్లాడితో సహా అపార్ట్​మెంట్​12వ అంతస్తు నుంచి దూకింది. ముంబయికి చెందిన రేష్మా ట్రెంచిల్(44), శరత్​ ములుకుట్ల భార్యాభర్తలు. వీరికి ఏడేళ్ల బాబు ఉన్నాడు. చాందివలిలో ఓ అపార్ట్​మెంట్లో ఉంటున్నారు. శరత్​  మే 23న కరోనాతో చనిపోయాడు. అప్పటి నుంచి భర్త పోయిన బాధతో రేష్మ ఇంట్లోనే ఉంటోంది. మీ అబ్బాయి విపరీతంగా అల్లరి చేస్తున్నాడని అపార్ట్​మెంట్​లో పక్క ఫ్లాట్ల​ వాళ్లు పదే పదే కంప్లయింట్స్​ చేయడంతో రేష్మ ఈ నెల 21న అపార్ట్​మెంట్ 12వ అంతస్తు నుంచి కొడుకుతో సహా దూకి చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిలో ఒకరిని అరెస్ట్​ చేశారు.