ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు మృతి

ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు మృతి

 నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలోమరణ మృదంగం వినిపిస్తోంది. ముఖ్యంగా, జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆరుగురు  రోగులు మృత్యువాతపడ్డారు. MICU వార్డ్ లో ఆక్సిజన్ అందక వీరంతా చనిపోయారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.   అయితే,ఆక్సిజన్ సరఫరా లో ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు.  వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.  ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.