
హైదరాబాద్, వెలుగు: డయాలసిస్ సర్వీస్లు అందించే నెఫ్రోప్లస్ బెంగళూరులోని కాంతిరావా వద్ద ఇండియన్ డయాలసిస్ ఒలంపియాడ్ ఐదో ఎడిషన్ను నిర్వహించింది. డయాలసిస్ పేషెంట్లు ఎంత బలంగా ఉన్నారో క్రీడల ద్వారా ఈ షోలో చూపించారు. 800 కి పైగా పేషెంట్లు పాల్గొన్నారని అంచనా. ఈ ఈవెంట్లో బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, 50 ఎం వాక్థాన్ వంటివి నిర్వహించారు.