ఏపీలో 667 కరోనా కేసులు, 9 మంది మృతి

ఏపీలో 667 కరోనా కేసులు, 9 మంది మృతి

అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో  667 కరోనా కేసులు నమోదయ్యయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. వైరస్ తో కొత్తగా 9 మంది మృతిచెందారని చెప్పింది. దీంతో కేసుల సంఖ్య 8,71,972 చేరగా..  7,033 మరణాలు సంభవించాయంది.  ప్రస్తుతం 5,910 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 8,59,029 మంది రికవరీ అయ్యారని చెప్పింది. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు. గుంటూరు, కడప, నెల్లూరు, అనంతపురం, విశాఖలో ఒక్కొక్కరు చనిపోయారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.