
న్యూఢిల్లీ: అప్పుల కారణంగా దివాలా తీసిన గోఫస్ట్ ఎయిర్లైన్స్ను దక్కించుకోవడానికి స్పైస్జెట్ బిడ్ వేసింది. స్పైస్జెట్ సీఎండీ సింగ్ బిడ్ను తన వ్యక్తిగత హోదాలో బిజీ బీ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి సమర్పించారు. “కొత్త ఎయిర్లైన్కు ఆపరేటింగ్ పార్టనర్గా స్పైస్జెట్ ఉంటుంది. అవసరమైన సిబ్బంది, సేవలు, పరిశ్రమ నైపుణ్యాన్ని అందిస్తుంది.
దీనివల్ల మెరుగైన వ్యయ నిర్వహణ, ఆదాయ వృద్ధి సాధ్యమవుతాయి”అని కంపెనీ తెలిపింది. తమ సంస్థలో దాదాపు 1,400 మందిని తొలగిస్తున్నట్టు స్పైస్జెట్ ప్రకటించిన కొన్ని రోజులకే సింగ్ గో ఫస్ట్కోసం బిడ్ వేశారు. షార్జాకు చెందిన స్కైవన్కూడా గోఫస్ట్ కోసం బిడ్ వేసింది. తాను దివాలా తీసినట్టు పేర్కొంటూ గత మేలో గోఫ్ట్ బ్యాంక్రప్టసీ ప్రొటెక్షన్కేసు వేసింది. కొత్త ఇన్వెస్టర్లు రాకపోవడంతో లిక్విడేషన్ను ప్రారంభించాలని బ్యాంకులు భావిస్తున్నాయి