రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి ..పెళ్లైన మూడు రోజులకే విషాదం

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి ..పెళ్లైన మూడు రోజులకే విషాదం

తిమ్మాపూర్, వెలుగు: కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌‌  జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్​ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల(22)కు, జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలం లొత్తునూర్​ గ్రామానికి చెందిన రాజుతో ఈ నెల 6న వివాహం జరిగింది. శుక్రవారం పీజీ సెట్​ ఎంట్రన్స్​ రాసేందుకు అఖిల భర్త రాజుతో కలిసి బైక్​పై తిమ్మాపూర్‌‌ లోని ఓ ఇంజినీరింగ్​ కాలేజీకి వచ్చింది. పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా, మహాత్మానగర్​ స్టేజీ సమీపంలో వేగంగా వచ్చిన లారీ బైక్​ను ఢీకొట్టింది. దీంతో అఖిల అక్కడికక్కడే చనిపోగా, రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్​ తెలిపారు.