
చొప్పదండి, వెలుగు: ప్రయాణికుల సౌకర్యార్థం కరీంనగర్ నుంచి వయా చొప్పదండి, లక్షెట్టిపేట రూట్లో మంచిర్యాలకు నాలుగు ఇ–-ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించినట్లు కరీంనగర్ 2 డీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నుంచి ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6.10 గంటల వరకు ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.