మానకొండూరు శాలివాహన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మానకొండూరు శాలివాహన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మానకొండూర్ ,వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మానకొండూర్ శాలివాహన కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో అధ్యక్షుడిగా వేణువంక రాజయ్య, ఉపాధ్యక్షులుగా రాధారపు అంజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సాయికుమార్, ఉప ప్రధాన కార్యదర్శి గా సిలివేరు సంతోష్ కుమార్ , కోశాధికారి గా వేణువంక వెంకన్న ,వేణువంక రాజమౌళి , కార్యవర్గ సభ్యులు గా వేణువంక వీరస్వామి, శనిగరపు రాజయ్య, ఇజ్జగిరి రాజు, వేణువంక శంకరయ్య, రాధారపు తిరుపతి , సలహాదారులుగా వేణువంక రామయ్య, వేణువంక సురేశ్, దరిపల్లి ఐలయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కుమ్మరి సంఘం సభ్యులు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.