
గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా యం.యన్. వి సాగర్ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘బ్యాచిలర్స్ ప్రేమకథలు’. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా హాజరైన దర్శకులు వీర శంకర్ క్లాప్ కొట్టగా, వి. సముద్ర కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సాగర్ మాట్లాడుతూ ‘ఇంతకుముందు నేను తీసిన ‘కాలం రాసిన కథలు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ ఉత్సాహంతోనే దానికి సీక్వెల్గా ‘బ్యాచిలర్స్ ప్రేమ కథలు’ తీస్తున్నా. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నా. అలాగే కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నా. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఇయర్ ఎండింగ్లో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నటీనటులు అన్నారు.