కొత్త మంత్రులకు పీసీసీ చీఫ్​ అభినందనలు

 కొత్త మంత్రులకు పీసీసీ చీఫ్​ అభినందనలు

ఎట్టకేలకు తెలంగాణ మంత్రి విస్తరణకు ముహూర్తం ఖరారైంది.  ఈరోజు ( జూన్​ 8) మధ్యాహ్నం 12.19 నిమిషాలకు కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి.. మక్తల్​ ఎమ్మెల్యే  వాకిటి శ్రీహరి... ధర్మపురి ఎమ్మెల్యే  అడ్లూరి లక్ష్మణ్ లకు మంత్రి పదవి వరించనుంది

కొత్తగా మంత్రులుగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురి మంత్రులతో పాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​ కాబోతున్న  రామచంద్ర నాయక్ కు   టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  శుభాకాంక్షలు తెలిపారు.  

కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అమలు చేస్తుందని అందుకే కులగణన చేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కొత్తగా మంత్రి పదవులు చేపడుతున్న వివేక్​ వెంకటస్వామి, శ్రీహరి, లక్ష్మణ్​ లకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.