ఏపీలో కొత్త పద్దతిలో ఆస్తులు రిజిస్ట్రేషన్.. 20 నిమిషాల్లోనే దస్తావేజులు

ఏపీలో  కొత్త పద్దతిలో ఆస్తులు రిజిస్ట్రేషన్..  20 నిమిషాల్లోనే దస్తావేజులు

ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం ఆంధ్రప్రదేశ్ లో మారుతోంది.  సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం అమలు  కానుంది.   రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్న CARD 1.0 స్తానంలో. CARD 2.0 ను తీసుకొస్తోంది ప్రభుత్వం.  కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ విధానం సులువు అవుతుంది. అయితే అనేక రకాల అనుమానాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. 

నూతన విధానం లో రిజిస్ట్రేషన్ ఎలా అంటే ? 

కొత్త కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రూపకల్పన ను ప్రభుత్వం చేపట్టింది.  ఆన్ లైన్ లోనే దస్తావేజులు తయారీ, స్లాట్ బుక్ చేసుకునే  వెసులుబాటు కూడ కల్పించారు.  రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద ఎక్కువ సేపు వేచి ఉండే పరిస్థితి కి చెక్ పెట్టటంతో పాటుగా, అక్రమాకుల ఆస్కారం లేకుండా నూతన విధానం ఉంటుందని చెబుతున్నారు.  వినియగదారులు సొంతంగా ఆన్లైన్ లో దస్తావేజులోని వివరాలు నమోదు చేసుకుని ఫీజు చెల్లించే అవకాశం  కూడా కల్పించారు.  రిజిస్ట్రేషన్ పూర్తయిన 20 నిమిషాల్లోనే  దస్తావేజులు జారీ కానున్నాయి.  ఈ నెల 15 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది, ఏపీ  సర్కారు. దీని వలన రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత ఏర్పడుతుందని చెబుతున్నారు. 
 

ఆరంభంలో చిక్కులు ఉంటాయన్న ప్రభుత్వం 

ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సదుపాయం అమలులోకి రావటానికి కొంత సాంకేతిక సమస్య ఎదురు అవుతుందని ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది. నూతన వర్షన్ కావటంతో రిజిస్ట్రేషన్ ను చేసుకునేందుకు ఇచ్చిన ఆప్షన్ లు పై కొంత అవగాహన ఉండాలని కూడ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపున నూతన వర్షన్ అమలు పై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని దీని వలన ఆరంభం లో కొంత వరకు ఇబ్బందులు ఉంటాయని, అయితే ఎట్టి పరిస్దితుల్లో సెప్టెంబర్ 15 నుండి పూర్తి స్దాయిలో అన్ని జిల్లాల్లో కూడ అమలులోకి తెస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.