నిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలు

నిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలు

బాల్కొండ, వెలుగు : బాల్కొండ ఎస్సైగా కె.శైలేందర్, మెండోరా ఎస్సైగా జాదవ్ సుహాసిని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాల్కొండ ఎస్సైగా పని చేసిన నరేశ్​ఆదిలాబాద్ కు, మెండోరా ఎస్సై యాసిర్ అరాఫత్ వేకెన్సీ రిజర్వ్ డ్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైలు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.

సదాశివనగర్ లో..

సదాశివనగర్​, వెలుగు : సదాశివనగర్​ ఎస్సైగా పుష్పరాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఎస్సై రంజిత్​ దేవునిపల్లి పీఎస్​ కు బదిలి అయ్యారు.  మండల  ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఎస్సై పేర్కొన్నారు.

ఎడపల్లి లో..

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి ఎస్సైగా ముత్యాల రమ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా పని చేసిన వంశీ కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు.  మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై రమ తెలిపారు.