రూ.75 కోట్లతో వరంగల్ బస్టాండ్ నిర్మాణం  :ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

రూ.75 కోట్లతో వరంగల్ బస్టాండ్ నిర్మాణం  :ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ పాత బస్​ స్టాండ్​ను కూల్చివేసి, స్మార్ట్​ సిటీ ప్రాజెక్ట్​లో భాగంగా కొత్త బస్​ స్టాండ్​ను రూ.75 కోట్లతో నిర్మాణం చేస్తున్నట్లు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వరంగల్​ సిటీలోని బస్ స్టాండ్ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్​నిర్మాణ పనులు స్పీడప్​గా జరుగుతున్నాయన్నారు. పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ పాటించాలని ఇంజినీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్​కు సూచించారు. ఆయనవెంట కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు తదితరులున్నారు.