ఆలయాలు, టూరిస్ట్ ప్రాంతాల్లో ఫుల్ రష్

ఆలయాలు, టూరిస్ట్ ప్రాంతాల్లో ఫుల్ రష్

న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచి గ్రేటర్ సిటీలోని ఆలయాలు రద్దీగా కనిపించాయి. బంజారాహిల్స్​లోని జగన్నాథ ఆలయం, గోల్డెన్ టెంపుల్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ టెంపుల్, పెద్దమ్మ తల్లి ఆలయం, బిర్లా మందిర్, చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్​తో పాటు ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సిటీలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్డీకపూల్​లోని లూథరన్ చర్చికి క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలకు, వికారాబాద్ సెగ్మెంట్ వాసులకు  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. వికారాబాద్ జిల్లా వాసులకు జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా రెడ్డి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. న్యూ ఇయర్ రోజున సెలవు ఉండటంతో సిటీలోని టూరిస్ట్ ప్లేసెస్ సందడిగా మారాయి. ట్యాంక్ బండ్​తో పాటు ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్, చార్మినార్, గోల్కొండ, జూపార్కులో సందర్శకుల రద్దీ కనిపించింది.  

– వెలుగు, హైదరాబాద్/ఖైరతాబాద్/వికారాబాద్