
ఇండియా,న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా పై కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన పరుగుల 307 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మరో రెండు ఓవర్లు ఉండగానే ముగించింది. లాథమ్ (145*) సెంచరీతో చెలరేగగా, విలియమ్సన్ (94*) పరుగులతో రాణించాడు. కివీస్ 88 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోగా వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు.
భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్ల తీయగా, శార్దూల్ ఒక వికెట్ తీశాడు. ఈ విక్టరీతో సిరీస్ లో కివీస్ 1, 0 తో ముందంజలో ఉంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మన్లలో ఓపెనర్లు ధావన్, శుభ్ మన్ గిల్, హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. మిడిలార్డర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ అర్థసెంచరీతో రాణించాడు. ఇతనికి సంజూ శాంసన్ 36 పరుగులు, సుందర్ 37 పరుగులు చేశారు.