
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,416 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,40,048 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,341కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,579 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,20,466గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,241 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. 15,388 కేసులు హోంఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 41,675 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 43,23,666 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతంగా మరియు రికవరీ రేటు 91.84 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 279, రంగారెడ్డి 132, మేడ్చల్ 112, నల్గొండ 82, భద్రాద్రి 79, ఖమ్మం 74, కరీంనగర్ 74, వరంగల్ అర్బన్ 48, సిద్ధిపేట్ 40, సూర్యపేట్ 37, యాదాద్రి 34, జగిత్యాల్ 33 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
For More News..