రాష్ట్రంలో మరో 1,531 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1,531 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,531 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,37,187 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,330కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,048 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,17,401గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,456 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. 15,425 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 43,790 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 42,40,748 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 91.65 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 293, మేడ్చల్ 120, రంగారెడ్డి 114, భద్రాద్రి 96, ఖమ్మం 83, నల్గొండ 74, కరీంనగర్ 71, జగిత్యాల్ 61, వరంగల్ అర్బన్ 54, సిద్ధిపేట్ 47, కామారెడ్డి 39 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

రాష్ట్రంలో వైద్యుల కొరత.. 7వేల మందికి ఒక్కడే డాక్టర్

స్టాంప్​ పేపర్లు నో స్టాక్.. డబుల్ రేటుకు అమ్ముతున్న వెండర్లు

మరో మూడు నెలలు ఉల్లితో లొల్లే