తెలంగాణలో కొత్తగా 1724 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1724 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1724 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 97,424 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 729కు చేరింది.

రాష్ట్రంలో కొత్తగా 1195 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 75,186గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో బుధవారం 23,841 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 8,21,311కు చేరింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 395, మేడ్చల్ 105, రంగారెడ్డి 169, వరంగల్ అర్బన్ 91, సిద్ధిపేట 81, కరీంనగర్ 101, నల్గొండ 67,  నిజామాబాద్ 61, సంగారెడ్డి 45, మంచిర్యాల 45, సూర్యపేట 44, పెద్దపల్లి 43, ఖమ్మం 42 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

కరోనా డ్రగ్‌ ఆర్డరిస్తే ఇంటికే..ఎక్కడో కాదు మనదగ్గరే..

ఫ్లైట్ దిగి..జనం పై నుంచి నడిచిండు

4 నెలల్లో 2 కోట్ల కొలువులు పోయాయ్