
దేశంలో కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేలకు తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 508 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,90,322కు చేరగా.. మృతుల సంఖ్య 1,20,010కు చేరింది. నిన్న ఒక్కరోజే 58,439 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,59,509కు చేరింది. నిన్న ఒక్కరోజే 10,66,786 మందికి టెస్టులు చేయడంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 10 కోట్ల 54 లక్షల 87 వేల 680కు చేరింది. ప్రస్తుతం దేశంలో 6,10,803 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
For More News..