రాష్ట్రంలో వేలల్లో నమోదవుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో వేలల్లో నమోదవుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం రోజు కరోనాతో ఇద్దరు చనిపోగా.. 31,199 కేసులు యాక్టివ్‎గా ఉన్నాయి. కాగా.. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో మేడ్చల్ జిల్లాలో 421, రంగారెడ్డిలో 286 కేసులు నమోదు కావడం గమనార్హం.

కాగా.. తెలంగాణలో ఇప్పటివరకు 7,31,212 కరోనా కేసులు నమోదకాగా.. 4,071 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి కోలుకొని 6,95,942 మంది డిశ్చార్జ్ అయ్యారు.

For More News..

ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా

ఇండిపెండెంట్‎ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ సీఎం

మేం అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు

దేశాలు దాటిన ‘పుష్ప’ క్రేజ్