ఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 72,861 శాంపిల్స్ పరీక్షించగా, 6,224 మందికి కరోనా నిర్ధారణ అయింది.ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో 890 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 225 కేసుల చొప్పున వచ్చాయి.  రాష్ట్రంలో 41 కరోనా మరణాలు సంభవించాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఆరుగురు చనిపోయారు. 7,798 మందికి కరోనా నుంచి కోలుకున్నారు.