చిలప్ చెడ్, కౌడిపల్లి, వెలుగు: ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు పాదయాత్రగా ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని బండపోతుగల్ సర్పంచ్ వీరన్నగారి లక్ష్మీ ప్రవీణ్ రెడ్డి 3 ఓట్లతో గెలుపొందగా, చిలప్ చెడ్ సర్పంచ్ జూల అనిల్ 500కు పైగా మెజార్టీ తో గెలుపొందాడు. తాము సర్పంచ్గా గెలిస్తే పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నామన్నారు. శుక్రవారం బండపోతుగల్ నుంచి 70 మందితో లక్ష్మీ ప్రవీణ్ కౌడిపల్లి మండలంలోని తునికి నల్ల పోచమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.
చిలప్ చెడ్ నుంచి సర్పంచ్అనిల్పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కౌడిపల్లి మండలం రాజిపేట పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి సర్పంచ్ గా గెలుపొందిన బాంచ దుర్గమ్మ నాగభూషణం రాజిపేట నుంచి తునికి నల్ల పోచమ్మ వరకు వార్డ్ మెంబర్లతో కలిసి వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
