
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నెల 10లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నందున ఎన్సీపీతో శివసేన చర్చలు జరిపింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో శివసేన నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ రాష్ట్ర తదుపరి సీఎం శివసేన నుంచే ఉంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. సీఎం రేసులో శరద్ పవార్ లేరని స్పష్టం చేశారు. తాను శరద్ పవార్తో మాట్లాడానని… ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈ నెల 9తో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ నెల 10లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.