న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) రెయిడ్స్ చేపట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్పై కొందరు అటాక్ చేశారు. అక్రమంగా ఆఫీసులోకి చొరబడి కాన్సులేట్ ఆఫీసర్లను కొట్టడంతో పాటు ప్రజా ఆస్తులకు నష్టం కలిగించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధికారులు పంజాబ్, హర్యానాల్లో బుధవారం సోదాలు నిర్వహించారు. పంజాబ్లోని మోగా, జలంధర్, లూథియానా, గురుదాస్పూర్, మొహాలీ, పాటియాలతోపాటు హర్యానాలోని కురుక్షేత్ర, యమునానగర్ జిల్లాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో నిందితుల సమాచారంతో కూడిన డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.