- మావోయిస్టులపై ఎన్ఐఏ రివార్డు
- నంబాల కేశవరావును పట్టిస్తే రూ.50 లక్షలు
- మిలటరీ చీఫ్ హిడ్మాకు రూ.25 లక్షలు
భద్రాచలం, వెలుగు : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దండకారణ్యంలోని మావోయిస్టుల తలలపై రివార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 2013 మే 25న జరిగిన జీరంఘాట్ఘటనతో పాటు మావోయిస్టుల విధ్వంసాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎన్ఐఏ 21 మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితా ప్రకటించింది. అందులోని వారిని గుర్తించి సమాచారం ఇచ్చిన వారికి లక్షల్లో రివార్డు ఇవ్వడంతో పాటు, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పింది.
మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్అలియాస్ గంగన్నను పట్టిస్తే రూ.50 లక్షలు, మిలటరీ చీఫ్ హిడ్మా పై రూ.25 లక్షలు, తిప్పరి తిరుపతి, గణేశ్లపై రూ.7 లక్షల చొప్పున, భగత్ హేమ్ల అలియాస్ భద్రు, బార్సే సుక్కా అలియాస్ దేవా, మండవి జయలాల్ అలియాస్ గంగా, సోమా సోడి అలియాస్ సురేందర్లపై రూ.5లక్షల చొప్పున, తెల్లం అయితూ, కుర్సం సన్నీ అలియాస్ కోశి, భద్రూ మోడియం అలియాస్ కిషన్లపై రూ.2.50 లక్షల చొప్పున, మోడియం రమేశ్ అలియాస్ లచ్చు, సరిత కేకా, సోమా, కుమ్మ గొందె అలియాస్ ప్రదీప్, కవ్వాసి కామేశ్, కోర్సా సన్నీ, సన్నీ హేమ్లా, కొర్సా లక్కు అలియాస్ మంగ్లీలపై రూ.లక్ష చొప్పున, సన్ను వెట్టి, మడకాంలపై రూ.50వేల చొప్పున ప్రకటించింది.
సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రఖర్మతో పాటు 32 మందిని మావోయిస్టులు జీరంఘాట్లో చంపేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో రివార్డులిస్తామని ప్రకటన విడుదల చేసింది.