ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు

ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు

ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఏ ఉక్కుపాదం మోపుతోంది. భారత్‌, -కెనడా మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఖలిస్థాన్‌ సానుభూతిపరులు, గ్యాంగ్‌స్టర్లపై ఫోకస్ పెట్టిన ఎన్ఐఏ ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఖలిస్థాన్ గ్యాంగ్ స్టార్ల హవాల పద్ధతులపై ఎన్ఐఏ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలు- గ్యాంగ్‌స్టర్ల నుంచి హవాల మార్గంలో డబ్బులు వస్తున్నాయని.. వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్‌, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్‌ఐఏ వర్గాలు చెబుతున్నాయి.

వీరికి పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపీఏ కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం (సెప్టెంబర్ 27న) పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13, హరియాణాలో నాలుగు చోట్ల, ఉత్తరాఖండ్‌లో రెండు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో చోట తనిఖీలు జరుగుతున్నాయి.

Also Read : ఏషియన్ గేమ్స్లో.. భారత్కు మరో గోల్డ్ మెడల్

ఇప్పటికే భారత్‌ నుంచి పారిపోయి యూకే, కెనడా, దుబాయ్‌, పాకిస్థాన్‌ ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న 19 మంది ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల జాబితాను ఎన్ఐఏ విడుదల చేసిన విషయం తెలిసిందే.