ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై NIA ప్రకటన

ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై NIA ప్రకటన

మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ(ఆర్కే) భార్య శిరీష అలియాస్‌ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం(జులై 21)  అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్‌ఐఏ ప్రకటన చేసింది. శిరీష‌ను అరెస్ట్ చేసినట్టుగా పేర్కొంది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్ట్ చేశామని చెప్పింది. శిరీష‌తో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్ట్ చేశామని తెలిపింది. దుడ్డు ప్రభాకర్, శిరీషలు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని.. వారితో కాంటాక్ట్‌లో ఉన్నారని పేర్కొంది.

మావోయిస్టుల నుంచి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయని గుర్తించినట్టుగా ఎన్‌ఐఏ పేర్కొంది. 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాల్గొన్నారని.. మావోయిస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కూడా చేస్తున్నారనని చెప్పింది. మావోయిస్టుల వారోత్సవాల వేళ భారీ కుట్రకు ప్లాన్ చేశారని ఆరోపించింది.