రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు.. కొత్త రూల్స్ ఇవే..

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ మళ్లీ  పొడిగింపు.. కొత్త రూల్స్ ఇవే..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా కట్టడికి ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నెల 8 వరకు విధించిన నైట్ కర్ఫ్యూను ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మరికొన్ని నిబంధనలను కూడా విధించింది. పెళ్లిలకు, శుభకార్యాలకు 100 మందికి మించి హాజరుకాకూడదని నిబంధన పెట్టారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్కు, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించింది. దహన సంస్కారాలలో 20 మందికి మించి పాల్గొనరాదని తెలిపింది. రాజకీయపరమైన సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, క్రీడలు మొదలైనవి ఏవీ నిర్వహించకూడదని తెలంగాణ ప్రభుత్వం షరతులు పెట్టింది.