
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్.. మరో పాన్ ఇండియా మూవీ ‘స్పై’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఎడిటర్ గ్యారీ బిహెచ్ దీనికి దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్. ఆర్యన్ రాజేష్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సమ్మర్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నాన్–థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్, స్టార్ నెట్వర్క్ సంస్థలు రూ. 40 కోట్లకు పూర్తి నాన్ థియేట్రికల్ రైట్స్ను పొందాయని నిర్మాత ప్రకటించారు. నిఖిల్ కెరీర్లో ఇది హయ్యెస్ట్. తను హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడంతో పాటు.. ‘స్పై’ కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న మూవీ కావడంతో ఎక్కువ రేటు పలికినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.