గ్రేటర్ నోయిడా: నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన విమెన్స్ 51 కేజీ విభాగం తొలి బౌట్లో నిఖత్ పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. చండీగఢ్కు చెందిన నిధిపై పంచ్ల వర్షం కురిపించిన నిఖత్ 5–-0 తేడాతో ఏకపక్ష విజయం అందుకొని ప్రి క్వార్టర్ ఫైనల్ చేరింది.
మరోవైపు వరల్డ్ చాంపియన్ మీనాక్షి (48 కేజీ) కూడా 5–0తో తమిళనాడుకు చెందిన వి. లక్షయను చిత్తుగా ఓడించింది. -75 కేజీ విభాగంలో పోటీపడుతున్న ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్ 5–0తో కృష్ణా వర్మపై ఏకపక్ష విజయం సాధించింది. మెన్స్లో ఫేవరెట్ బాక్సర్లు శుభారంభం చేశారు సాగర్ (50 కేజీ) 5–0తో అశుతోష్పై గెలవవగా.. సుమిత్ (75 కేజీ ) 5-–0తో అర్ష్ప్రీత్ సింగ్ను ఓడించాడు. 70 కేజీ విభాగంలో యువ సంచలనం హితేష్ గులియా తన ప్రత్యర్థి అంకిత్ను చిత్తు చేయగా.. -60 కేజీల్లో సచిన్ 5–0తో తుషార్ను ఓడించాడు.
