
- రూ. 32 వేల జీతం, పే స్లిప్స్ ఇచ్చేందుకు మేనేజ్ మెంట్ ఓకే
ఖైరతాబాద్, వెలుగు: పది రోజులగా సమ్మె చేస్తున్న నిమ్స్నర్సులకు రూ. 32వేల జీతం, పే స్లిప్స్ ఇవ్వడానికి హాస్పిటల్ మేనేజ్ మెంట్ అంగీకరించింది. దీంతో బుధవారం నర్సులు సమ్మె విరమించారు. ఏండ్లుగా నిమ్స్ లో పనిచేస్తున్నా పర్మినెంట్ చేయడం లేదంటూ నర్సులు 10 రోజుల పాటు సమ్మె చేశారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కు ఇచ్చే బెనిఫిట్స్ కాంట్రాక్ట్ నర్సులకు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇతర డిమాండ్లను నెరవేర్చుకొని సమ్మె విరమించారు. పే స్లిప్స్ తో పాటు, జీతాన్ని రూ.25 వేల నుంచి రూ.32 వేలకు పెంచేందుకు మేనేజ్ మెంట్ ఒప్పుకుంది. టెన్యూర్ ను 6 నెలల నుంచి ఏడాదికి చేయడంతో పాటు 2021 జులై నుంచి 30 శాతం ఏరియర్స్ ఇస్తామని నిమ్స్మేనేజ్మెంట్ ప్రకటించడంతో నర్సులు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.